రెజ్లర్లతో చర్చలకు కేంద్రం సిద్ధం.. అనురాగ్​ ఠాకూర్ ట్వీట్

-

బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ తమను లైంగికంగా వేధించాడని గత కొద్దినెలలుగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లూ వీరి ఆందోళనను పట్టించుకోని కేంద్ర సర్కార్ ఎట్టకేలకు స్పందించింది. ఇటీవలే కేంద్ర హోం మంత్రి అమిత్ షా రెజ్లర్లను కలిసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రెజ్లర్లను కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. రెజ్లర్లు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అయిన కొన్ని రోజులకే ఈ పరిణామం జరిగింది. రెజ్లర్లతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ట్వీట్‌ చేశారు.

బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేయాలని రెజ్లర్లు పట్టుబడుతున్నారు. అతడిని అరెస్టు చేసేవరకు న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చర్చలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. “రెజ్లర్ల సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.” అని మంగళవారం అర్ధరాత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ట్వీట్​ చేశారు. చర్చల కోసం తాను మరోసారి రెజ్లర్లను ఆహ్వానించినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news