బెంగాల్​లో ఘోర ప్రమాదం.. వ్యాన్​లో పూలు లోడ్ చేస్తుండగా ఢీకొట్టిన లారీ.. ఆరుగురు దుర్మరణం

-

వారంతా రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలకు చెెందిన వారు. కూలీ పనిచేస్తే గానీ పూట గడవని పరిస్థితుల్లో బతుకుతున్నారు. రోజువారీలాగే కూలీ పనికి వెళ్లారు. ఈ క్రమంలో పికప్ వ్యాన్​లో పూలు లోడ్ చేస్తున్నారు. పనిలో పూర్తిగా నిమగ్నమయ్యారు. త్వరగా పని చేసుకుని.. కాస్త కడుపు నింపుకుందామని ఆశగా పనిలో బిజీ అయ్యారు. కానీ వారికి పొంచి ఉన్న ప్రమాదాన్ని మాత్రం పసిగట్టలేకపోయారు. పూలు లోడ్ చేస్తున్న సమయంలో అటుగా వచ్చిన ఓ లారీ వారిని బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు కూలీలు మృతి చెందారు. బంగాల్​లోని ఖరగ్​పుర్​ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

A terrible accident in AP Three youths died

‘పశ్చిమ మేదినీపుర్​ జిల్లా.. ఖరగ్​పుర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని బురమలా వద్ద ఇవాళ తెల్లవారుజామున 10 నుంచి 12 మంది కార్మికులు కలిసి పికప్​ వ్యాన్​లో పూలు లోడింగ్​ చేస్తున్నారు. అకస్మాత్తుగా సిమెంట్​ లారీ వెనుక నుంచి వచ్చి వరిని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరణించారు. మిగతా వారు స్వల్పంగా గాయపడ్డారు. మాకు సమాచారం అందగానే ఘటనాస్థలికి చేరుకున్నాం. అప్పటికే మృతి చెందిన ఐదుగురిని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం.’ అని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news