భూటాన్‌ అభివృద్ధికి భారత్‌ కట్టుబడి ఉంది: ప్రధాని మోదీ

-

ప్రపంచ దేశాలతో భారత్ మైత్రి సాగించేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా భారత్ – భూటాన్ల మధ్య సంబంధంపై మాట్లాడారు. అధిక రాబడి కలిగిన దేశంగా భూటాన్‌ ఎదిగేందుకు భారత్‌ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. భారత్‌-భూటాన్‌ మధ్య ఉన్న సౌర, పవన విద్యుత్తు, గ్రీన్‌ హైడ్రోజన్‌ రంగాల్లో భాగస్వామ్యంపై ఇరు దేశాలు అంగీకరించాయి.

ఈ రంగాల్లో భాగస్వామ్యం పెంపొందించుకునేందుకు ఇరు దేశాల ప్రధాన మంత్రులు అంగీకరించారని మోదీ – తోబ్గే సమావేశం జరిగిన రెండు రోజుల తర్వాత ఇరు దేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. భూటాన్‌ 12వ పంచవర్ష ప్రణాళిక కోసం భారత్‌ రూ.5000 కోట్ల సాయం అందించింనందుకు భూటాన్ ప్రధాని తోబ్గా కృతజ్ఞతలు తెలిపారని ప్రకటనలో పేర్కొంది. వ్యవసాయ, ఆరోగ్య, విద్య, నైపుణ్యరంగాలు, మౌలికవసతుల కల్పనకు ఈ నిధులు తోడ్పాడతాయని తోబ్గే అన్నారని వెల్లడించింది. ఇరుదేశాల మధ్య రైల్వే లైన్ల నిర్మాణంలో అభివృద్ధిని ప్రధానులు స్వాగతించినట్లు ఈ ప్రకటన వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news