భరత్​పూర్​లో బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. 11 మంది దుర్మరణం

-

రాజస్థాన్​లోని భరత్​పుర్​లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది దుర్మరణం చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓ ట్రక్కు.. ఆగి ఉన్న బస్సును ఢీ కొట్టడం వల్ల ఇవాళ వేకువజామున ఈ దుర్ఘటన జరిగింది. అటుగా వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని.. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు.

గుజరాత్​లోని భావ్​నగర్​ నుంచి ఉత్తర్​ ప్రదేశ్​లో మథురకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. జైపుర్​- ఆగ్రా హైవేపై లఖన్​పుర్​ ప్రాంతంలో ఆగి ఉన్న బస్సును లఖన్​పుర్​ ప్రాంతంలో ట్రక్కు ఢీ కొట్టిందని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు పురుషులు, ఆరుగురు మహిళలు మృతి చెందినట్లు వెల్లడించారు. మృతులను అంతు, నంద్రం, లల్లూ, భరత్, లాల్జీ, అతని భార్య మధుబెన్, అంబాబెన్, కంబుబెన్, రాముబెన్, అంజుబెన్, మధుబెన్​గా పోలీసులు గుర్తించారు. మృతులందరూ గుజరాత్​లోని భావ్​నగర్​కు చెందినవారని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news