భారత సరిహద్దు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. కేంద్రం కీలక ఆదేశాలు

-

భారత సరిహద్దులో ఉన్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా జమ్ము కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ లో హై అలర్ట్ ప్రకటించింది. ఇక దేశ రాజధాని ఢిల్లీ, హర్యానా, పశ్చిమ బెంగాల్ లో భద్రతను కట్టుదిట్టం చేసారు. పోలీసులు, పాలనాధికారులకు పూర్తిగా సెలవులను రద్దు చేశారు. సరిహద్దు రాష్ట్రాల్లో విద్యాసంస్థలను కూడా మూసివేయనున్నారు. పాక్ సరిహద్దును పంచుకుంటున్న గుజరాత్ సముద్రం తీరం వెంట కోస్ట్ గార్డ్స్ ను రౌండ్ ది క్లాక్ పహారా కాయాలని సూచించారు.

పోలీసులు, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది సెలవులను కూడా రద్దు చేసారు. హిమాచల్ ప్రదేశ్ లో భారీగా భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. ప్రముఖ దేవాలయాల దగ్గర తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. సరిహద్దు రాష్ట్రాల ప్రజల ఇళ్లలోనే ఉండాలని బయటికీ రావద్దని సూచించారు. ఎవ్వరూ అనవసర ప్రయాణాలు చేయవద్దని తెలిపారు. మరోవైపు పాక్ డ్రోన్ దాడికి పాల్పడితే భారత్ వాటిని తిప్పి కొట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news