లోక్ సభ ఎంపీలకు బీజేపీ విప్ జారీ..!

-

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఈనెల 18 నుంచి 22 వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బిజెపి తమ లోక్ సభ ఎంపీలకు విప్ జారీ చేసింది. తప్పనిసరిగా పార్లమెంట్ సమావేశాలకు దాదాపు అందరూ హాజరై ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతు తెలపాలని తెలిపింది. ఈ పార్లమెంట్ ప్రత్యేక సెషన్ లో ప్రభుత్వం ప్రధానంగా నాలుగు బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లులను ఆమోదం తెలిపేందుకు అందరూ ఎంపీలు రావాలని విప్ జారీ చేసింది బిజెపి.

పార్లమెంటు ప్రత్యేక సెషన్ లో భాగంగా ఐదు రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి ఇందులో మొదటి రోజు 75 ఏళ్ల స్వాతంత్ర భారత దేశ ప్రయాణం పై చర్చించనున్నారు అనంతరం రాజ్యసభలో కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామక బిల్లు ది పోస్ట్ ఆఫీస్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది లోక్సభలో అడ్వకేట్ సవర్ణ బిల్లు రిజిస్ట్రేషన్ బిల్లులపై చర్చ జరగనున్నట్ల సమాచారం. బీజేపీ ఎంపీలు ఎక్కువ మంది ఉండటంతో బిల్లులు అన్ని ఆమోదం తెలపనున్నట్టు తెలుస్తోంది. ఏం జరుగుతుందనేది కొద్ది రోజులు ఎదురుచూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news