బెంగాల్ పరువు తీయాలనేదే బీజేపీ ప్లాన్ : సీఎం మమతా బెనర్జీ

-

పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. టీఎంసీ ప్రభుత్వం పై మహిళలు ఆగ్రహం గా ఉన్నారని ప్రధాని తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం మమతా బెనర్జీ ప్రధాని వ్యాఖ్యలు స్పందించారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆరోపణలు చేశారు. తమ పార్టీ నేతలను అరెస్ట్ చేయించి బెంగాల్ పరువు తీయడానికే బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమె తెలిపారు. ఇవాళ కోల్ కతాలో ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. టీఎంసీ లీడర్లను అరెస్ట్ చేయాలని కేంద్రం ఆదేశించినట్టు ఏజెన్సీలు పేర్కొంటున్నాయని ఆమె వెల్లడించారు. ఎన్నికల్లో గెలవాలంటే తొలుత ప్రజల్లో నమ్మకం గెలవండి అని.. బీజేపీకి మమత బెనర్జీ సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news