ఈనెల 15న నాగపూర్​లో బీఆర్‌ఎస్‌ భవనాన్ని ప్రారంభించనున్న కేసీఆర్

-

బీఆర్ఎస్ పార్టీని జాతీయ రాజకీయాల్లో తిరుగులేని పార్టీగా అభివృద్ధి చేయాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు. మొదట మహారాష్ట్ర నుంచి ఈ పార్టీ జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని షురూ చేశారు. ఇప్పటికే పలు మార్లు బహిరంగ సభలు నిర్వహించి అక్కడి ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆ రాష్ట్రంలో తెలంగాణ సరిహద్దులో ఉన్న గ్రామాల నాయకుల్లో చాలా మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఇక తాజాగా బీఆర్‌ఎస్‌ తన తొలి సొంత శాశ్వత భవనాన్ని మహారాష్ట్రలో ప్రారంభించడానికి రంగం సిద్ధం చేస్తోంది. నాగపూర్‌లో సువిశాలమైన కొత్త భవనాన్ని నిర్మిస్తోంది. ఆ భవనాన్ని ఈ నెల 15న పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. 15న ఉదయం నాగపూర్‌ వెళ్లనున్న కేసీఆర్‌.. అక్కడ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడంతోపాటు స్థానికంగా ఏర్పాటు చేసిన చేరికల సమావేశంలోనూ పాల్గొంటారు. ముంబయి, పుణె, ఔరంగాబాద్‌లోనూ పార్టీ ఆఫీసుల ఏర్పాటుకు నిర్ణయించారు.

Read more RELATED
Recommended to you

Latest news