ప్రపంచ రికార్డు సృష్టించిన భారత ఓటర్లు : ఎన్నికల సంఘం

-

భారత ఓటర్లు ప్రపంచ రికార్డు సృష్టించినట్లు పేర్కొంది ఎన్నికల సంఘం. దేశంలో 7 విడతల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ విజయవంతంగా నిర్వహించామని CEC రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ ఎన్నికల్లో 64.2కోట్ల మంది ఓట్లు వేయడం ప్రపంచ రికార్డు అని చెప్పారు. ఇది G7 దేశాలైన USA, UK, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, కెనడా, ఇటలీ జనాభా కంటే 1.5 రెట్లు ఎక్కువన్నారు.

CEC Rajiv Kumar reacts about indiaa

ప్రపంచంలోనే అత్యధికంగా మనదేశంలో 31.2కోట్ల మంది మహిళలు ఓట్లు వేసినట్లు ఎన్నికల తర్వాత నిర్వహించిన తొలి ప్రెస్‌మీట్‌లో ఆయన వివరించారు. ఓటర్లకు స్టాండింగ్‌ అవేషన్‌ ఇచ్చిన CEC రాజీవ్ కుమార్.. ఈ ఎన్నికల్లో రికార్డుస్థాయిలో 64.2 కోట్ల మంది ఓటు వేశారన్నారు. 31 కోట్ల మంది మహిళలు ఓటేశారు.. మన దేశంలో ఓటేసినవారి సంఖ్య.. జీ7 దేశాల జనాభాకు ఒకటిన్నర రెట్లు అన్నారు. రేపు దేశవ్యాప్తంగా కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు రాజీవ్‌ కుమార్‌.

Read more RELATED
Recommended to you

Latest news