ఛత్తీస్‌గఢ్‌ ఎన్​కౌంటర్ అప్డేట్.. 29 మావోయిస్టులు హతం

-

లోక్ సభ ఎన్నికల ముంగిట ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్​ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు 29 మంది మావోయిస్టులు మృతి చెందారు. కాంకేర్‌లోని చోటేబైథియా పీఎస్‌ పరిధి కల్పర్ అడవిలో జరిగిన ఎదురుకాల్పుల్లో బీఎస్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్, ఇద్దరు జవాన్లకు గాయాలు అయ్యాయి. ఘటనాస్థలంలో ఏకే 47, మూడు ఇన్సాస్ రైఫిల్స్ సహా మొత్తం పదికిపైగా అధునాతన తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్), డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ) బృందాలు ఈరోజు సంయుక్త సెర్చ్ ఆపరేషన్‌ నిర్వహిస్తుండగా ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు జిల్లా ఎస్పీ ఇంద్రకల్యాణ్ తెలిపారు.  ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని వెల్లడించారు. మావోయిస్టుల ఎదురుకాల్పుల్లో గాయపడిన పోలీసులు, బీఎస్ఎఫ్ సిబ్బందిని ఆస్పత్రులకు తరలించేందుకు అదనపు బలగాలను కల్పర్ అడవులకు పంపించామని చెప్పారు. చనిపోయిన మావోయిస్టుల్లో అగ్రనేత శంకర్‌రావు కూడా ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. మరోవైపు కాంకేర్‌ జిల్లాలోని కల్పర్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన 29 మంది సీపీఐ మావోయిస్టు కార్యకర్తల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నామని బీఎస్ఎఫ్ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news