IPL 2024 : భారీ స్కోరు చేసిన కేకేఆర్ … రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

-

ఐపీఎల్ 2024లో నేడు కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య కోల్కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్ జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది.

ఓపెనర్ సునీల్ నరైన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.49 బంతుల్లో 100 సెంచరీ చేశాడు.ఇందులో 11 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అతనికి ఇదే తొలి సెంచరీ కావడం విశేషం.మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ 10 రన్స్ చేసి అవుట్ అయ్యాడు.రఘువంశీ 30 పరుగులు చేయగా,కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 7 బంతుల్లో 11 రన్స్ చహళ్ బౌలింగ్ ఎల్బిడబ్ల్యూ అయ్యాడు.రస్సెల్ 10 బంతుల్లో 13 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. చివర్లో రింక్ సింగ్ 9 బంతుల్లో 20 పరుగులు చేయడంతో కోల్కతా భారీ స్కోరు నమోదు చేయగలిగింది.రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో అవేశ్ ఖాన్, కుల్దీప్ సేన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news