మహారాష్ట్రకు బయలుదేరిన సీఎం కేసీఆర్

-

బీఆర్ఎస్ పార్టీని జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా మార్చడంపై ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో పార్టీ బలోపేతంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే తరచూ అక్కడ పర్యటిస్తూ.. బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడి ప్రజలను ఆకర్షించేందుకు యత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ మరోసారి మహారాష్ట్రలో కేసీఆర్ పర్యటించనున్నారు.

ఇందుకోసం హైదరాబాద్ బేగంపేట నుంచి ప్రత్యేక విమానాశ్రయంలో మహారాష్ట్రలోని కొల్హాపూర్​కు సీఎం కేసీఆర్ బయలుదేరారు. అక్కడికి చేరుకున్న తర్వాత ముందుగా అంబబాయి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అక్కడి నుంచి సాంగ్లి జిల్లాలోని వాటేగావ్‌ గ్రామంలో.. మధ్యాహ్నం 12:45 గంటలకు ప్రముఖ సంఘ సంస్కర్త దివంగత అన్నాభావూ సాఠే 103వ జయంతి వేడుకల్లో కేసీఆర్ పాల్గొంటారు. ఆయన విగ్రహానికి కేసీఆర్‌ నివాళులర్పిస్తారు.

ఇవాళ ఒంటిగంటకు అన్నాభావూ కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్ కలుస్తారు. 1:30 గంటలకు ఇస్లాంపూర్‌లోని రఘునాథ్‌దాదా పాటిల్‌ ఇంట్లో భోజనం చేస్తారు. సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.

Read more RELATED
Recommended to you

Latest news