BREAKING: తీహార్ జైలుకు సీఎం కేజ్రీవాల్‌..15 రోజులు !

-

BREAKING: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కు ఊహించని షాక్‌ తగిలింది. తీహార్ జైలుకు ఢిల్లీ సిఎం కేజ్రివాల్ ను తరలించనున్నారు. ఈ మేరకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలాగే.. సీఎం కేజ్రీవాల్ కు 15 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. ఇవాళ 11 గంటలకు రౌస్ ఎవిన్యూ కోర్టులో ఢిల్లీ సీఎం కేజ్రివాల్ ను హాజరు పరిచింది ఈడీ. ఈ సందర్భంగా విచారణ చేసిన రౌస్ ఎవిన్యూ కోర్టు తీహార్ జైలుకు ఢిల్లీ సిఎం కేజ్రివాల్ ను తరలించమని ఆదేశాలు ఇచ్చింది.

కాగా, తన చిన్న కొడుకుకు పరీక్షలు ఉన్న తరుణంలో..కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. తన చిన్న కొడుకు పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ కోరుతూ కవిత పిటిషన్ వేశారు. అయితే… కల్వకుంట్ల కవిత వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరుగనుంది.ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన కవిత… జ్యుడీషియల్ రిమాండ్‌లో భాగంగా తిహార్ జైల్లో ఉన్నారు. ఇక ఇవాళ కవిత పిటిషన్‌పై రౌజ్ అవెన్యూ కోర్టు లో విచారణ జరుగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news