హోలీ స్పెషల్.. పుణె వినాయకుడికి ద్రాక్షపండ్లతో అలంకరణ

-

దేశవ్యాప్తంగా హోలీ సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. చిన్నాపెద్దా కలిసి హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. రంగులు చల్లుకుంటూ కోలాహలంగా సందడి చేస్తున్నారు. మరోవైపు ఈ పండుగను పురస్కరించుకుని కొంత మంది తెల్లవారుజామునే ఆలయాలకు పోటెత్తుతున్నారు. పండుగ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని పుణె నగరంలో వెలసిన ప్రసిద్ధ దగడూశేఠ్‌ వినాయక ఆలయాన్ని హోలీ పండుగ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించారు.

దాదాపు 2 వేల కిలోల ద్రాక్ష పండ్లతో ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఆలయ ప్రాంగణాన్ని నలుపు, ఆకుపచ్చని ద్రాక్షలతో ఆదివారం రోజున అందంగా తీర్చిదిద్దారు. సంకటహర చతుర్థి రోజున ఇక్కడ ప్రతి ఏటా ద్రాక్ష మహోత్సవ్‌ను జరుపుతారు. ఈ నేపథ్యంలోనే ‘సహ్యాద్రి ఫామ్స్‌’ ఆధ్వర్యంలో ఆలయాన్ని ద్రాక్షలతో అలంకరించగా.. చూసేందుకు పెద్దసంఖ్యలో భక్తజనం తరలివచ్చారు. స్వామివారి వద్ద ఉంచిన ద్రాక్ష పండ్లను ససూన్‌ ఆస్పత్రి, పితాశ్రీ వృద్ధాశ్రమంతోపాటు పలు సంస్థలకు పంపిణీ చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news