ఊపిరి పీల్చుకుంటున్న దిల్లీ.. మెరుగైన గాలి నాణ్యత

-

దిల్లీ వాసులకు ఎట్టకేలకు ఊరట లభించింది. గత కొంత కాలంగా వాయు కాలుష్యంతో తల్లడిల్లిపోతున్న హస్తిన ప్రజలు తాజాగా హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎందుకంటే ఇవాళ ఆ నగరంలో వాయు నాణ్యత కాస్త మెరుగుపడింది. వర్షం కారణంగా, గాలి వేగం గంటకు 20 కిలోమీటర్ల వరకు ఉండటం వల్ల కాలుష్య కారకాలు వాతావరణం నుంచి కొంత వరకు తొలగిపోయాయి.

సోమవారం రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు 7.2 శాతం మేర వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అంతకుముందు రోజు 400 పాయింట్లుగా ఉన్న వాయు నాణ్యత సూచి-AQI తాజాగా 387 పాయింట్లకు చేరుకుందని వెల్లడించారు. వాయు నాణ్యత మెరుగు పడినప్పటికీ దిల్లీలోని పలు ప్రాంతాలను పొగ మంచు కప్పేసిందని.. ఈ నెలలో గత పది రోజులుగా దిల్లీలో తీవ్ర స్థాయిలో AQI నమోదైందని చెప్పారు.

దిల్లీలో ఈ పరిస్థితులు ఏర్పడటానికి ప్రధాన కారణం పంటలను తగలబెట్టడమేనని దిల్లీ ప్రభుత్వం, ఐఐటీ-కాన్పుర్​ సంయుక్తంగా నిర్వహించిన ప్రాజెక్ట్​లో వెల్లడైంది. ఈ చర్య ద్వారానే గత కొద్దిరోజులుగా 31 నుంచి 51 శాతం మేర గాలి నాణ్యత తగ్గుతూ వస్తుందని తేలింది.

Read more RELATED
Recommended to you

Latest news