Delhi liquor scam case: కేజ్రీవాల్‌ పిటిషన్ పై రేపు తీర్పు వెలువరించనున్న కోర్టు

-

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు రేపు (శుక్రవారం) తీర్పు వెలువరించనుంది.లిక్కర్ కేసులో తనను ఈడీ అరెస్ట్ చేయడాన్ని సీఎం కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తులు దీపాంకర్ దత్తా ,సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం మే 17న తీర్పును రిజర్వ్‌ చేసింది.

మార్చి 21న ఈడీ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసులో జూన్ 20న ట్రయల్ కోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసింది. అయితే, ట్రయల్‌ కోర్టు ఉత్తర్వులను ఈడీ హైకోర్టులో సవాల్‌ చేయాగా.. జూన్ 25న ఢిల్లీ హైకోర్టు ట్రాయల్‌ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై స్టే విధించింది.

Read more RELATED
Recommended to you

Latest news