వ్యవసాయ రంగం చాలా సంక్షోభాలను ఎదుర్కొంటోంది : సీఎం చంద్రబాబు

-

ఆంధ్ర ప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలని, అన్ని విధాలుగా సాయం అందిస్తామని సీఐఐ ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. విశాఖలో సీఐఐ ప్రతినిధులతో ఆయన వర్చువల్‌గా సమావేశం అయ్యారు.రాష్ట్రంలోని వనరులు, అవకాశాలపై సీఐఐ ప్రతినిధులకు సీఎం చంద్రబాబు వివరించారు. రాష్ట్రాన్ని పునర్నించే క్రమంలో పరిశ్రమలకు మెరుగైన రాయితీలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆర్థిక సంస్కరణల తర్వాత పబ్లిక్, ప్రైవేట్ పీపుల్స్ పార్ట్‌నర్ షిప్ పాలసీని ప్రవేశపెట్టబోతున్నామని చంద్రబాబు తెలిపారు.

”పీపుల్ అంటే కేపిటల్ అని, ఇతర అంశాలన్నీ కేపిటల్‌కు అదనం. ఆక్వా కల్చర్, హార్టికల్చర్ హబ్‌గా ఏపీకి మంచి పేరుంది. ఫార్మా ప్రొడక్షన్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలతో వీటిని అనుసంధానం చేయాలి అని అన్నారు. వీటి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి పలు కార్యక్రమాలు అమలు చేస్తోంది అని తెలిపారు. సులభతర వ్యవసాయం అనేది నా విధానం. ఇతర పరిశ్రమలు, రంగాలతో పోలిస్తే వ్యవసాయ రంగం చాలా సంక్షోభాలను ఎదుర్కొంటోంది.” అని సీఎం చంద్రబాబు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news