దిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

-

భారత్ రిపబ్లిక్‌ డే వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని దిల్లీ లో గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు ఈ వేడుకకు హాజరయ్యారు.

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌ సంప్రదాయ బగ్గీలో కర్తవ్యపథ్కు చేరుకుని రాష్ట్రపతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సైనికుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆ తర్వాత శకటాల ప్రదర్శన ప్రారంభమైంది. ఈ శకటాల్లో తెలుగు రాష్ట్రాల శకటాలు కూడా ప్రదర్శించారు. శకటాల ప్రదర్శన తర్వాత పరేడ్, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలను జాతీయ మహిళా శక్తితోపాటు ప్రజాస్వామిక విలువలు ప్రతిబింబించేలా నిర్వహించారు. ‘ఈ వేడుకల్లో సంప్రదాయ బ్యాండ్‌కు బదులుగా శంఖం, నాదస్వరం, నగారాతో ప్రదర్శన ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version