IPL 2023 : హాఫ్ సెంచరీల్లో ధావన్ అరుదైన రికార్డ్

-

IPLలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ అరుదైన రికార్డ్ సృష్టించారు. ఈ మెగా టోర్నీలో 50 హాఫ్ సెంచరీలు చేసిన మూడవ బ్యాటర్ గా నిలిచారు. నిన్న KKR తో జరిగిన మ్యాచ్ లో ధావన్ 9 ఫోర్లు, ఓ సిక్సర్ తో 57 పరుగులు చేశారు.

ఐపిఎల్ లో ధావన్ 50 హాఫ్ సెంచరీలు, 2 సెంచరీలు చేశారు. డేవిడ్ వార్నర్ 59, విరాట్ కోహ్లీ 50 హాఫ్ సెంచరీలతో ధావన్ కంటే ముందు వరుసలో ఉన్నారు. కాగా,  కోల్కతా మరియు పంజాబ్ మ్యాచ్ లో వెస్ట్ ఇండీస్ వీరుడు ఆండ్రే రస్సెల్ ఎట్టకేలకు తన స్థాయికి తగిన ప్రదర్శన చేయడంతో కోల్కతా ఉత్కంఠ గేమ్ లో విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 180 పరుగుల లక్ష్యాన్ని ఇవ్వగా, కోలకతా చేదనలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news