IPL 2023 : బౌలర్‌పై ధోనీ ఆగ్రహం..వీడియో వైరల్

-

IPL 2023 : ధోని సేన స్పీడ్‌ కు బ్రేకులు వేసింది రాజస్థాన్‌ జట్టు. ఐపీఎల్ 16వ సీజన్ లో సీఎస్కే వరుస విజయాలకు బ్రేక్ పడింది. గురువారం సీఎస్కే తో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. 203 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేయగలిగింది.

అయితే, ఈ మ్యాచ్‌ లో మిస్టర్ కూల్ గా ఉండే ఎమ్మెస్ ధోనీకి కోపం వచ్చింది. IPL లో భాగంగా నిన్న రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో…16వ ఓవర్ వేసిన సీఎస్కే బౌలర్ మతిష పతిరానా ధోని ఆగ్రహానికి గురయ్యాడు. పతిరానా వేసిన బంతిని హెట్మెయిర్ టచ్ చేసి రన్ కు వెళ్తుండగా…ధోని నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు త్రో విసిరారు. మధ్యలో పతిరనా బంతిని పట్టుకోగా… రనౌట్ మిస్ అయింది. దీంతో ధోని అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news