ఒడిశాలో మరో రైలు ప్రమాదం.. దుర్గ్‌-పూరీ ఎక్స్​ప్రెస్​లో మంటలు

-

వరుస రైలు ప్రమాదాలు ఒడిశా ప్రజలను వణికిస్తున్నాయి. ఇటీవలే ఆ రాష్ట్రంలో జరిగిన రైలు ప్రమాదం యావత్ భారతదేశాన్ని పెను విషాదంలోకి నెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఒడిశాలో మరో రైలు ప్రమాదానికి గురైంది. నౌపడా జిల్లాలోని ఖరియార్ రోడ్ రైల్వే స్టేషన్ వద్ద పూరీ-దుర్గ్ ఎక్స్​ప్రెస్​లో మంటలు చెలరేగాయి. రైలులోని ఏసీ కోచ్​లో గురువారం రాత్రి పది గంటల సమయంలో మంటలు చెలరేగాయి. బ్రేక్ ప్యాడ్​లో లోపం వల్ల మంటలు వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు.

బీ3 కోచ్​లో మంటలు గుర్తించామని ఈస్ట్ ​కోస్ట్ రైల్వే తెలిపింది. బ్రేకులను పూర్తిగా వదిలేయకపోవడం వల్ల రాపిడి తలెత్తి మంటలు అంటుకున్నాయని వెల్లడించింది. బ్రేక్ ప్యాడ్ మినహా.. రైలుకు ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేసింది. కోచ్​ లోపలకు మంటలు వ్యాపించలేదని ఈస్ట్ ​కోస్ట్ రైల్వే తెలిపింది. మంటలు గుర్తించిన వెంటనే అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగాయని వివరించింది. సమస్యను పరిష్కరించిన తర్వాత రైలు బయల్దేరిందని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news