ఛతీస్ గడ్ లో ఎన్ కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి

-

కేవలం రోజుల వ్యవధిలోనే మావోయిస్టులు-పోలీసుల మధ్య ఛతీస్ గడ్ దండకారణ్యంలో ఎదురుకాల్పులు జరిగాయి.ఇందులో మావోయిస్టులకు గట్టి దెబ్బలు తగిలాయి. బీజాపూర్ జిల్లాలో బుధవారం ఉదయం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన వాళ్లలో ఓ మహిళా మావోయిస్టు కూడా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.

ఇటీవల ఇదే ప్రాంతంలో మావోయిస్టులు ముగ్గురు స్థానికులను హతమార్చారు. దీంతో.. భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగించిన క్రమంలోనే ఈ భారీ ఎన్ కౌంటర్ జరిగింది.
మరోవైపు ఛత్తీస్ ఘడ్  అడవుల్లో ఇటీవల వరుసగా ఎదురు కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. బీజాపూర్ జిల్లాలోని పీడియా అటవీ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు నక్సలైట్లు, అంతకు ముందు చోటేతుంగాలి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.

Read more RELATED
Recommended to you

Latest news