World Cup 2023 : ఇవాళ వరల్డ్ కప్ లో రెండు మ్యాచ్లు.. పాకిస్తాన్ ఇంటికి వెళుతుందా?

-

England vs Pakistan, 44th Match : ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ లో భాగంగా… ఇవాళ రెండు మ్యాచ్లు జరగనున్నాయి. మొదటగా ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ జాట్ల మధ్య ఇవాళ ఉదయం 10:30 కు తొలి మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ మహారాష్ట్రలోని పూణే నగరంలో జరగనుంది. ఇక మరొక కీలక మ్యాచ్ ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ పాకిస్తాన్ కు చాలా కీలకమైనది.

England vs Pakistan, 44th Match

ఈ మ్యాచ్ లో భారీ తేడాతో గెలిస్తే పాకిస్తాన్ సెమిస్కు చేరే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇంగ్లాండ్ జట్టుపై ఏకంగా 400 పరుగుల తేడాతో విజయం సాధించాలి లేదా లక్ష్యాన్ని 2.5 ఓవర్లలోనే సాధించాల్సి ఉంటుంది. అలా అయితేనే పాకిస్తాన్ సెమిస్ బరిలో ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ ఇవ్వాళ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో కోల్కత్తలో ప్రారంభమవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news