రామాలయ ప్రారంభోత్సవం రోజున అందరూ అలా చేయండి.. ప్రధాని పిలుపు

-

అయోధ్యలో ఈనెల 22న జరగనున్న రామాలయ ప్రారంభోత్సవం కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే 10వేల మందికి పైగా భద్రతా సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. అయితే తాజాగా ప్రధానీ రామాలయ ప్రారంభోత్సవానికి సంబంధించి కీలక సందేశం చేశారు. ఆ వేడుక జరిగే రోజున ప్రజలందరు తమ ఇళ్లల్లో జ్యోతిని వెలిగించాలని పిలుపునిచ్చారు. రామజ్యోతితో తమ జీవితాల్లో స్పూర్తిదాయకంగా నిలుస్తుందని తెలిపారు. శుక్ర‌వారం షోలాపూర్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఆయన మాట్లాడారు.

దేశంలో ఎన్నో ఏళ్ల నుంచే గరీబీ హఠావో నినాదాలు వినిపించినా పేదరికం మాత్రం పోలేదన్నారు. అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠతో దశాబ్దాల పాటు అనుభవించిన ఆవేదన దూరమైపోయిందని తెలిపారు. గతంలో భక్తులు టెంట్‌ నుంచి బాలరాముడి దర్శనాన్ని చేసుకునేవారని అన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణంతో భక్తుల చిరకాల కోరిక నెరవేరిందని తెలిపారు. ఇక జనవరి 22న ఆలయ ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో ప్రధాని అనుష్టాన దీక్ష చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news