BREAKING : గుంతలోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు విద్యార్థులు దుర్మరణం

-

ఉత్తరా ఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పానీవాలా బండ్ వద్ద రోడ్డు పక్కనున్న గుంతలోకి ఓ కారు తీసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులు దుర్మరణం చెందారు. ప్రమాదంలో మరో యువతి తీవ్రంగా గాయపడింది. గమనించిన స్థానికులు అంబులెన్స్ తో పాటు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన యువతిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పినట్లు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  బాధితులంతా డెహ్రాడూన్ లోని ఐఎంఎస్ కళాశాల విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. విహార యాత్ర కోసం ముస్సోరికి వెళ్లినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే కారు వేగంగా నడపడంతో అదుపు తప్పి గుంతలోకి దూసుకెళ్లినట్లు చెప్పారు. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు, ఓ విద్యార్థిని మరణించినట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news