ఛతీస్ గడ్ లో బీజేపీకి అవకాశం ఇవ్వండి : ప్రధాని మోడీ

-

బిలాస్ పూర్ ప్రధాని మోడీ ర్యాలీ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు ప్రధాని మోడీ. రైతులకు బీజేపీ ప్రభుత్వం ఎంతో మేలు చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏం చేయలేదన్నారు. ఛతీస్ గడ్ లో బీజేపీకి అవకాశం ఇవ్వండి. ఛతీస్ గడ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారుని ప్రధాని పేర్కొన్నారు. 

కాంగ్రెస్ అవినీతికి,  అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది అన్నారు ప్రధాని.  కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతితో కేంద్ర ప్రభుత్వ పథకాలు పేదలకు అందడం లేదన్నారు. ప్రధాని కిసాన్ సమ్మన్ నిధిని కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన రైతులకు ఎంతో మేలు చేసిందని.. రైతుల ప్రభుత్వం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో చేయని పనులను బీజేపీ నెరవేర్చిందన్నారు. కాంగ్రెస్ హయాంలో అవినీతి, అక్రమాలు జరిగాయని నిప్పులు చెరిగారు. ఛతీస్ గడ్ లో బీజేపీకి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తామని బహిరంగ సభలో ప్రజలను కోరారు ప్రధాని మోడీ. 

Read more RELATED
Recommended to you

Latest news