రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలలో గత రెండు మూడు రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణ, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, నంద్యాల జిల్లాలలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అనౌన్స్ చేశారు.

తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, కొత్తగూడెం, వనపర్తి, వికారాబాద్, నారాయణపేట, గద్వాల్, మహబూబ్ నగర్ జిల్లాలలో వర్షాలు ఎక్కువగా పడతాయని అధికారులు సూచనలు జారీ చేశారు. రెండు నుంచి మూడు రోజులపాటు వర్షాలు అధికంగా పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. తెలంగాణలోని వాసులకు కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. అవసరం ఉంటేనే బయటికి వెళ్లాలని లేనిచో ఇళ్లలోనే ఉండాలని చెబుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు వర్షం కురుస్తున్న సమయంలో బయటికి వెళ్ళరాదు.