హస్తం పార్టీ అన్నీ తప్పుడు వాగ్దానాలే చేస్తుంటుంది – ప్రధాని మోదీ

-

హస్తం పార్టీ అన్నీ తప్పుడు వాగ్దానాలే చేస్తుంటుందని మండిపడ్డారు ప్రధాని నరేంద్ర మోడీ. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం పాల్వాల్ లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్రం రద్దు చేసిన ఆర్టికల్ 370 ని తిరిగి తీసుకు వస్తామని కాంగ్రెస్ చెబుతుందని.. కానీ పాక్ ఆక్రమిత ప్రాంతాన్ని వెనక్కి తీసుకు వస్తామని ఎన్నడైనా చెప్పిందా..? అని ప్రశ్నించారు.

పాకిస్తాన్ కి మద్దతుగా ఉండే ఆ పార్టీ.. హర్యానా ప్రజల అభివృద్ధి కోసం ఆలోచించగలదా..? అని ప్రశ్నించారు. దేశానికి ముఖ్యమైన ప్రతి అంశాన్ని కాంగ్రెస్ చిక్కుల్లో పెట్టిందంటూ మండిపడ్డారు. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడానికి కాంగ్రెస్ అనుమతించలేదని.. జమ్మూ కాశ్మీర్ లో రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేయడానికి కాంగ్రెస్ అనుమతించలేదన్నారు.

మహిళలకు పార్లమెంటు, అసెంబ్లీలో రిజర్వేషన్లు లేకుండా చేశారని మండిపడ్డారు మోదీ. కాంగ్రెస్ విభజన వ్యూహాలను తిరస్కరించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. బిజెపికి రాష్ట్ర ప్రజల నుంచి లభిస్తున్న అఖండ మద్దతు కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడడం లేదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version