అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తాం – మంత్రి నారాయణ

-

రేపు స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మచిలీపట్నం వస్తున్నట్లు తెలిపారు మంత్రి పొంగూరు నారాయణ. సీఎం పర్యటన కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. నేషనల్ లా కాలేజ్, డంపింగ్ యార్డ్, టిటిడి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో సీఎం పాల్గొంటారని తెలిపారు.

త్వరలోనే రాష్ట్రమంతా ఇంటింటికి రక్షిత నీరు అందించేలా కుళాయిల కనెక్షన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. వర్షపు నీటి కాలువల ఆక్రమణలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు. ఇక బుడమేరు ఆక్రమణల వల్లే విజయవాడకు వరదలు వచ్చాయని అన్నారు నారాయణ. ఆపరేషన్ బుడమేరు మాదిరిగా అక్రమ నిర్మాణాలపై దృష్టి సారిస్తామని.. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని వెల్లడించారు.

పేదలకు టిడ్కో ఇళ్ల వంటి ప్రత్యామ్నాయాలు చూపిస్తామని తెలిపారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కాలువలు ఆక్రమించిన వారు.. స్వచ్ఛందంగా కాళీ చేయాలని సూచించారు. ఏ రాజకీయ పార్టీ వారైనా, ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీల విమర్శలకు అవకాశం ఇవ్వకుండా ముందుకు వెళతామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version