44 ఏళ్ళ తర్వాత భారత్ లో అత్యధిక వర్షపాతం…!

-

గత 44 సంవత్సరాల్లో ఆగస్టు నెలలో భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదైందని దేశంలో వివిధ ప్రాంతాల్లో నమోదు అయిన వరదల డేటా ఆధారంగా భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగస్టు 28 వరకు ఈ నెలలో 25 శాతం మిగులు వర్షపాతం నమోదైంది. 1983 లో ఆగస్టులో 23.8 శాతం అధిక వర్షపాతం నమోదైంది. భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డి) గణాంకాలు ప్రకారం, 1976 ఆగస్టులో దేశంలో 28.4 శాతం అధిక వర్షపాతం నమోదైంది.

rain

దేశంలో ఇప్పటివరకు సాధారణం కంటే తొమ్మిది శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, గోవాలో అధిక వర్షపాతం నమోదైంది, సిక్కింలో అధికంగా వర్షపాతం నమోదైంది. సెంట్రల్ వాటర్ కమిషన్ (సిడబ్ల్యుసి) ప్రకారం, ఆగస్టు 27 వరకు దేశంలోని జలాశయాల మొత్తం నిల్వ స్థానం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే మెరుగ్గా ఉంది. కేంద్ర పాలిత ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్లలో తక్కువ వర్షపాతం నమోదైంది.

Read more RELATED
Recommended to you

Latest news