పాక్ దాడులు చేస్తే.. భారత్ కూడా దాడులు చేస్తుంది : ప్రధాని మోడీ

-

పాకిస్తాన్ కాల్పులు జరిపితే గట్టిగా బదులు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలు ఇచ్చారు. తాజాగా త్రివిధ దళాలతో జరిగిన ప్రత్యేక సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడారు. భారత్ వైఖరీ ఎప్పుడు ఒక్కటే.. కశ్మీర్ విషయంలో ఇంతకు మించి మాట్లాడేది ఏం లేదన్నారు. వాళ్లు ఒక్క తూటతో పేల్చితే.. క్షిపణితో పేల్చండి అని చెప్పేశారు. పాకిస్తాన్ దాడి చేస్తే.. గట్టి చర్య ఉంటుందన్నారు. రేపు పీవోకే తిరిగి ఇవ్వడం.. ఉగ్రవాదుల అంశం చర్చ ఉంటుందని చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ కి అప్పగించడం తప్ప.. పాక్ కి గత్యంతరం లేదని తేల్చి చెప్పారు.

ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు. మాకు ఎవ్వరి మధ్యవర్తిత్వం అవసరం లేదు. త్రివిధ దళాలకు ప్రధాని మోడీ కీలక ఆదేశాలు జారీ చేసారు. పాకిస్తాన్ తమ వైఖరీని మార్చుకోవాలని.. సాయంత్రం 6.30 గంటలకు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అధికారులతో సంయుక్త సమావేశం ఉంటుందని వెల్లడించారు. ఈ సమావేశంలోో DGMO, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధికారులు పాల్గొననున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news