భారత వైద్యుల్లో 60% మహిళలే.. దయచేసి జోక్యం చేసుకోండి మోదీ జీ : IMA

-

​ కోల్‌కతాలో జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ ఘటనపై పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం రోజున దేశవ్యాప్తంగా బంద్ కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఐఎంఏ ఓ లేఖ రాసింది. భారతీయ వైద్యుల్లో 60 శాతం మంది మహిళలే ఉన్నారని.. ప్రస్తుత వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఆ లేఖరో కోరింది. “మీరు స్పందిస్తే.. మహిళా వైద్యులకే కాకుండా పనిచేస్తున్న మహిళలందరికీ ఆత్మవిశ్వాసాన్ని చేకూర్చుతుంది” అని పేర్కొంది.

జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటనతో రెండు అంశాలు వెలుగుచూశాయని ఐఎంఏ తెలిపింది. మహిళలకు సురక్షితమైన విశ్రాంతి సౌకర్యాలు లేకపోవడం ఒకటి కాగా.. సరైన భద్రతా ప్రొటోకాల్స్‌ లేని కారణంగా వల్ల దాడులు జరగడం అని లేకలో పేర్కొంది. వృత్తిస్వభావం రీత్యా వైద్యులు ముఖ్యంగా మహిళా సిబ్బంది హింసకు గురయ్యే అవకాశాలు ఎక్కువని.. ఈ నేపథ్యంలో ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో సరైన భద్రత కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందిఅని వెల్లడించింది. అంతే కాకుండా.. వైద్యసేవలు, ఆస్పత్రులకు సంబంధించిన చట్టాలను పటిష్ఠం చేయాలని కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news