Union Budget 2025: కిసాన్ క్రెడిట్ కార్డులపై కీలక ప్రకటన.. పరిమితి పెంపు !

-

కిసాన్ క్రెడిట్ కార్డుల విషయంలో తీపికబురు అందించింది కేంద్ర సర్కార్‌. కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి పెంచింది మోదీ సర్కార్. ఈ మేరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటన చేశారు. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా ఇప్పటివరకు 3 లక్షల రూపాయల రుణం అందిస్తుండగా ఇకపై ఆ మొత్తం 5 లక్షల రూపాయలకు పెంచుతున్నట్టు ప్రకటించారు నిర్మలా సీతారామన్‌.

Increase in credit limit of Kisan Credit Cards

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఫలితంగా రైతులకు ఎక్కువ మొత్తంలో రుణం లభించనుందని తెలిపారు నిర్మలా సీతారామన్‌. అటు ఈ సందర్భంగా ప్రధానమంత్రి ధన్ ధాన్య యోజన కార్యక్రమాన్ని ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ పథకం ద్వారా వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. గోదాములు, నీటిపారుదల, రుణ సౌకర్యాల కల్పన చేయనున్నట్లు వివరించారు. ఒక కోటీ 70 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version