డిప్యూటీ పీఎంగా నీతీశ్ కుమార్.. ఒప్పించే ప్రయత్నంలో ఇండియా కూటమి

-

2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి గట్టి పోటీనిచ్చింది. అబ్‌ కీ బార్‌… చార్‌ సౌ పార్‌ అని నినదించిన బీజేపీని సొంతంగా మెజార్టీ తె‌చ్చుకోలేని పరిస్థితికి తెచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఎన్డీఏ కూటమిలోని పలు పార్టీల మద్దతు కోరే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. ఈ నేథ్యంలో ఎన్​డీఏ కూటమిలో భాగమైన జేడీయూ అధినేత నీతీశ్​ కుమార్​కు ఇండియా కూటమి డిప్యూటీ ప్రధాని పదవిని ఆఫర్​ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయవర్గాల సమాచారాన్ని ఉటంకిస్తూ జాతీయ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.

అయితే దీనిపై ఇప్పటి వరకు ‘ఇండియా’ కూటమి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.  ఎన్​డీఏ కూటమిలో బీజేపీ తర్వాత మూడో అతిపెద్ద పార్టీగా జేడీయూ నిలిచింది. ప్రభుత్వం ఏర్పాటు చేయడంలోనూ జేడీయూ కీలకంగా వ్యవహరించనుంది. ఈ నేపథ్యంలో నీతీశ్​ను తమ వైపునకు తిప్పుకునేందుకు ‘ఇండియా’ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలిసింది. బిహార్​ డిప్యూటీ సీం సమ్రాట్​ చౌదరి, నీతీశ్​ను కలిసేందుకు ఆయన నివాసానికి చేరుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news