ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి.. సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్

-

ఏపీ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి  సీఎం జగన్ తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో ఎమోషనల్ గా  మాట్లాడారు. ఏపీ ప్రజల కోసం ఎంతో చేయాలని తాపత్రయ పడ్డామని బాధతో చెప్పారు. అరకోటి మంది రైతన్నల ప్రేమ ఏమైందో తెలియదు. అమ్మఒడి కోటి 53 లక్షల మందికి మంచి చేశాం. మత్య్సకారుల భరోసా, పుట్ పాత్ ఇడ్లీ షాపులు నడిపించుకునే వ్యాపారస్తులకు వారికి జగనన్నతోడు.. ఇన్నికోట్ల మందికి మంచి చేస్తే.. మేనిఫెస్టో అంటే చెత్త బుట్టల్లో పడేసేది కాదు.. బైబిల్, ఖురాన్ అని భావిస్తూ.. ఏకంగా 99 శాతం వాగ్దానాలను అమలు చేశామని.. అంతే చిత్తశుద్దితో పని చేశాం.

ఎప్పుడూ జరగని విధంగా పిల్లల చదువులు క్వాలిటీ చదువులను తీసుకొచ్చామని గుర్తు చేశారు. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చాం. ప్రతీ ఇంటికి సేవలు అందించేలా.. కరెప్షన్ లేకుండా ఇంటివద్దకే పాలన తీసుకొచ్చాం. ఎప్పుడూ చూడని మార్పును తీసుకొచ్చాం. మహిళా సాధికారత అంటే ఇది.. ప్రపంచానికి తీసుకొచ్చాం. ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తరువాత అభిమానం ఏమైందో.. అక్కాచెల్లెళ్ల  ఆప్యాయత ఏమైందో తెలియదు. తాను చేయగలిగేది ఏమి లేదు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. మంచి చేయడానికి ప్రజలు తోడుగా ఉంటారు. తాను చేయాల్సిన పని వైసీపీ చేస్తుంది. పేదవాడికి తోడుగా ఉండేందుకు గళం విప్పి.. అండగా నిలుస్తుంది. విజయం సాధించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కి కంగ్రాట్స్  తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news