శాస్త్రీయ రంగ పరిశోధనల్లో భారత్​- బ్రిటన్ కీలక ఒప్పందాలు..!

-

శాస్త్రీయ రంగ పరిశోధనల్లో భారత్​- బ్రిటన్​ బంధం మరింత బలపడింది. 8 మిలియన్​ పౌండ్ల(రూ. 76.94కోట్లు) విలువ గల ఐదు ప్రాజెక్టులపై ఇరు దేశాలు కలిసి పని చేయనున్నాయి. బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులపై పోరాడటానికి ప్రపంచ దేశాలకు ఉపయోగపడే విధంగా యాంటీ మైక్రాబియల్​ రెసిస్టెన్స్​(ఏఎమ్​ఆర్​) సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ పరిశోధనలు జరగనున్నాయి.
ఫార్మా పరిశ్రమల్లోని యాంటీ-మైక్రాబియల్​ ఉత్పత్తిలో భారత్​ అగ్రస్థానంలో ఉంది. ఈ యాంటీ మైక్రాబియల్​ తయారీ సమయంలో ఉత్పన్నమయ్యే వ్యర్థాలు ఏఎమ్​ఆర్​కు ఏ విధంగా ఉపయోగపడతాయన్న అంశాన్ని అర్థం చేసుకోవడమే ప్రాజెక్టుల ముఖ్య ఉద్దేశం.

narendra modi
narendra modi

ఈ ఐదు ప్రాజెక్టులు సెప్టెంబర్​ నుంచి ప్రారంభంకానున్నాయి. బ్రిటన్​ రీసర్చ్​ అండ్​ ఇన్నోవేషన్​ ఫండ్​ ఫర్​ ఇంటర్నాషనల్​ కొలాబొరేషన్​ నుంచి 4 మిలియన్​ పౌండ్లను అందించనుంది బ్రిటన్​. తన వనరుల నుంచి 4 మిలియన్​ పౌండ్లను ఇవ్వనుంది భారత్​. ఈ వివరాలను దక్షిణాసియా- కామన్​వెల్త్​ మంత్రి లార్డ్​ తారీఖ్​ అహ్మద్​ వెల్లడించినట్టు బ్రిటీష్​ హై కమిషన్​ ఓ ప్రకటనను విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news