Breaking News : పారిశ్రామిక వేత్త రతన్ టాటాకు తీవ్ర అస్వస్థత..!

-

ప్రముఖ పారిశ్రామిక వేత్త, టాటా సన్స్ అధినేత రతన్ టాటాకు తీవ్ర అస్వస్థత చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు ఆయన్ను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించారు. సోమవారం అర్థరాత్రి 12.30 గంటల నుంచి 1 గంట మధ్యలో ఆయనను ఆస్పత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు నిపుణుల వైద్య బృందం ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్టు సమాచారం.

ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ షారుఖ్ అస్పి గోల్వాల్ల ఆధ్వర్యంలో రతన్ టాటాకు చికిత్స జరుగుతుంది. మెడికల్ టీమ్ ఎప్పటికప్పుడు టాటా ఆరోగ్య పరిస్థితిని గమనిస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉందని ఆస్పత్రి వైద్యుల బృందం వెల్లడించినట్లు జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయనను మామూలు స్థితికి తీసుకువచ్చేందుకు వైద్యులు
శతవిధాలా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news