జమ్మూ కాశ్మీర్ లో వరస ఎన్ కౌంటర్లు… ముగ్గురు తీవ్రవాదుల హతం

-

జమ్మూ కాశ్మర్ లో వరసగా ఎన్ కౌంటర్లు జరిగాయి. నిన్న రాత్రి, ఈ రోజు ఉదయం వరసగా ఎన్ కౌంటర్లు జరిగాయి. భద్రతా దళాల  బలగాల గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలో ఈ ఎన్ కౌంటర్లు చోటు చేసుకున్నాయి. గత రాత్రి పుల్వామాలోని చెవాక్లాన్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్లో ఒక పాకిస్థానీతో సహా ఇద్దరు జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఎన్ కౌంటర్లో కీలక ఉగ్రవాది హతమయ్యారు.  2018 నుంచి యాక్టివ్‌గా ఉన్న పాక్‌ జేఈఎం కమాండర్‌ కమాల్‌ భాయ్‌ హతమయ్యాడని  కశ్మీర్‌ ఐజీపీ విజయ్‌ కుమార్‌ వెల్లడించారు. 

మరోవైపు ఈ రోజు ఉదయం మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఉదయం గందర్‌బాల్‌లోని సెర్చ్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. లష్కర్ ఈ తోయిబాకు చెందిన ఒక ఉగ్రవాది హతమయ్యాడు. పోలీసులు, భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని అదుపుతోకి తీసుకుని గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news