ఈనెల 25న జేఈఈ మెయిన్‌ ర్యాంకులు

-

ఈ నెల 25వ తేదీన జేఈఈ మెయిన్‌ ర్యాంకులు విడుదల కానున్నట్లు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) ప్రకటించింది. ఫలితంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తుల ప్రక్రియ తేదీల్లో ఐఐటీ మద్రాస్‌ మార్పు చేసింది. జేఈఈ మెయిన్‌లో కనీస మార్కులు సాధించిన 2.50 లక్షల మందికి మాత్రమే ఐఐటీల్లో బీటెక్‌లో చేరేందుకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసే అవకాశం కల్పించనున్నారు. ఈసారి అడ్వాన్స్‌డ్‌ పరీక్షను ఐఐటీ మద్రాస్‌ నిర్వహిస్తోంది.

జేఈఈ మెయిన్‌ ర్యాంకులను ఏప్రిల్‌ 20వ తేదీన వెల్లడిస్తామని గతంలో ఐఐటీ మద్రాస్‌కు ఎన్‌టీఏ సమాచారమిచ్చింది. ఫలితాలు విడుదలైన మరుసటి రోజు ఏప్రిల్‌ 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభిస్తామని ఐఐటీ మద్రాస్‌ గతేడాది డిసెంబరు 1వ తేదీన షెడ్యూల్ విడుదల చేసింది. తాజాగా ఎన్‌టీఏ ఈ నెల 25వ తేదీన జేఈఈ మెయిన్‌ ర్యాంకులు వెల్లడిస్తామని ప్రకటించడంతో అడ్వాన్స్డ్ పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఈ నెల 21కి బదులు.. 27 నుంచి మే 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తులు స్వీకరించేలా షెడ్యూల్‌లో ఐఐటీ మద్రాస్ మార్పు చేసింది. పరీక్ష మాత్రం యథాతథంగా మే 26న జరుగుతుందని ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news