జేఈఈ మెయిన్‌ పరీక్షలో కీలక మార్పులు

-

 విద్యార్థులకు అలర్ట్. ఐఐటీ, ఎన్‌ఐటీలలో ప్రవేశం నిమిత్తం నిర్వహించే జేఈఈ మెయిన్‌ రెండో సెషన్‌ పరీక్షలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఏప్రిల్‌ 2 నుంచి జరగనున్ఈ పరీక్షలో జాయింట్‌ అడ్మిషన్‌ బోర్డు(జేఏబీ) ఈ సంవత్సరం కొన్ని కీలక మార్పులు చేసింది.

 బీఈ, బీటెక్‌ విద్యార్థులకు నిర్వహించే  పేపర్‌-1లోని పార్టు- బీలో ఛాయిస్‌ విధానాన్ని ఈ ఏడాది తొలగించారు. పార్టు-బీలో ఈసారి అడిగే 5 ప్రశ్నలకు ఎలాంటి ఛాయిస్‌ ఉండదు. 3 సబ్జెక్టులు (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)లలో పార్టు-ఏలో 20 ప్రశ్నలు, పార్టు-బిలో 5 ప్రశ్నలు ఉంటాయి. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్ట్‌ విద్యార్థులకు పేపర్‌- 2ఏ, బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ విద్యార్థులకు పేపర్‌- 2బీ నిర్వహించనున్నారు.

పేపర్‌-1 ఇంజినీరింగ్‌ ఎగ్జామ్ ఫస్ట్ షిఫ్టు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకుసెకండ్ షిఫ్టు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. ఉదయం పరీక్ష రాసేవారు 7 గంటల వరకు, మధ్యాహ్నం పరీక్షకు హాజరయ్యే వారు ఒంటి గంట వరకు కేంద్రానికి చేరుకోవాలని ఎన్‌టీఏ సూచించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version