నా విజయం కరీంనగర్ ప్రజలకు, ప్రధాని మోడీకి అంకితం : బండి సంజయ్

-

తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు 08 బీజేపీ, 08 కాంగ్రెస్, 01 ఎంఐఎం పార్టీలు విజయం సాధించాయి. బీఆర్ఎస్ పార్టీ ఒక్క పార్లమెంట్ స్థానాన్ని కూడా దక్కించుకోకపోవడం గమనార్హం. విజయోత్సవం సందర్భంగా  బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తాజాగా మీడియాతో మాట్లాడారు. తనకు ఓటు వేసిన ప్రతీ పౌరుడికి ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. 

నరేంద్ర మోడీ పువ్వు గుర్తు పై ఓటు వేసి గెలిపించడం పై తప్పకుండా పార్లమెంట్ ప్రజలకు రుణపడి ఉంటాను. నా విజయం కరీంనగర్ ప్రజలకు, ప్రధాని మోడీకి అంకితం అన్నారు. కార్యకర్తలు కష్టపడి చేశారు. కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు పోరాడిన తీరు.. కరోనా సమయంలో పార్లమెంట్ ప్రజలకు కొందరూ రాజకీయ ప్రలోభాలకు గురిచేసినా జనం తనకు ఓటు వేశారు. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారు. మేము అనుకున్న లక్ష్యం నెరవేరింది. కరీంనగర్ నియోజకవర్గ ప్రజల ఆశలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. 

Read more RELATED
Recommended to you

Latest news