రైతును పెళ్లి చేసుకునే వారికి రూ.5 లక్షల ప్రోత్సాహం ఇవ్వండి.. కన్నడ కర్షకుల వెరైటీ డిమాండ్

-

రైతులను ఎవరూ పెళ్లి చేసుకునేందుకు ముందుకు రావడం లేదని, రైతు అనగానే యువతుల తల్లిదండ్రులు కూడా పిల్లనివ్వడానికి ఆసక్తి చూపించడం లేదని కర్ణాటక రైతులు వాపోతున్నారు. అందుకే రైతు యువకుడ్ని చేసుకునే యువతికి రూ.5 లక్షల ప్రోత్సాహాన్ని ఇవ్వాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను వారు కోరారు. సేద్యాన్ని నమ్ముకుని, ఏటా రూ.లక్షల ఆదాయాన్ని గడిస్తున్నా, 45 ఏళ్లు వస్తున్నప్పటికీ రైతులకు వివాహం కావడం లేదని రైతు సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.

బడ్జెట్లో సేద్యానికి, వ్యవసాయ కార్మికులకు, రైతులకు నిధుల కేటాయింపునకు సంబంధించి రైతు సంఘాలకు చెందిన 218 మంది రైతులతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమావేశమయ్యారు. కరవు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతుల రుణమాఫీతో పాటు రైతును వివాహం చేసుకునే యవతికి రూ.5 లక్షల ప్రోత్సాహాన్ని ఇవ్వాలని సీఎంకు వినతి పత్రాన్ని అందించారు. ప్రభుత్వం జారీ చేస్తున్న ఐదు గ్యారంటీలను రైతు సంఘం నాయకులు కొనియాడారు. గ్రామాల్లో ఈ పథకాలకు చక్కని స్పందన లభిస్తోందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.

Read more RELATED
Recommended to you

Latest news