World Cup 2023 : విరాట్‌ కోహ్లీ పరువు తీసిన శ్రీలంక కెప్టెన్

-

World Cup 2023 : విరాట్‌ కోహ్లీ పరువు తీశాడు శ్రీలంక కెప్టెన్ కుషాల్ మెండీస్. దీంతో శ్రీలంక కెప్టెన్ కుషాల్ మెండీస్ పై నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. 49 సెంచరీలతో సచిన్ రికార్డుని సమం చేసిన విరాట్ కోహ్లీని మీరు అభినందించాలని అనుకుంటున్నారా? అని విలేకరులు అతడిని ప్రశ్నించారు.

Kusal Mendis makes bizarre statement after Virat Kohli’s 49th ODI hundred

దీనికి ‘నేనెందుకు కోహ్లీని అభినందించాలి?’ అంటూ నవ్వుతూ బదిలిచ్చారు. దీంతో కోహ్లీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇలాంటి సమాధానాలతో మళ్ళీ 55 రన్స్ కే ఆల్ అవుట్ కాక తప్పదు’ అంటూ కౌంటర్ ఇస్తున్నారు.

ఇది ఇలా ఉండగా… వరల్డ్ కప్ లో భారత్ విజయపరంపర కొనసాగుతోంది. టీమిండియా తాజాగా మరో అద్భుత విజయాన్ని అందుకుంది. సౌత్ ఆఫ్రికా తో మ్యాచ్లో 243 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 327 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన సౌతాఫ్రికాను భారత బౌలర్లు 83 పరుగులకే ఆల్ అవుట్ చేశారు. రవీంద్ర జడేజా 5 వికెట్లతో అదరగొట్టారు. శమి, కుల్దీప్ చరో 2, సిరాజ్ ఒక వికెట్ తీశారు. అంతకుముందు భారత్ ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు.

Read more RELATED
Recommended to you

Latest news