తెలంగాణ భవన్ లో లాల్ దర్వాజ సింహ వాహిని అమ్మ వారి బోనాలు

-

ఢిల్లీ : తెలంగాణ భవన్ లో లాల్ దర్వాజ సింహ వాహిని అమ్మ వారి బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మ వారికి బోనం సమర్పించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ… వచ్చే ఏడాది నుంచి ఢిల్లీలో జరిగే బోనాల ఉత్సవాలకు కేంద్ర ప్రభుత్వ నిధులు తెలిపారు.

ఢిల్లీలో జరిగే బోనాల ఉత్సవాలకు కేంద్ర టూరిజం శాఖ తరపున నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఢిల్లీలో మరింత వైభవంగా బోనాల ఉత్సవాలు నిర్వహిస్తామని వెల్లడించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. లాల్ దర్వాజ బోనాల కమిటీ ఇతర దేవాలయాలను కలుపుకొని ఉత్సవాలు నిర్వహించాలన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ, హైదరాబాద్ లో బోనాల ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news