తల్లి సంరక్షణ విస్మరించిన కూతురికి ఆస్తిపై హక్కులుండవు : మద్రాస్ హైకోర్టు

-

తల్లి సంరక్షణను చూసుకోని కూతురికి ఆమె ఆస్తిపై హక్కులు ఉండవి మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. తల్లి ఆలనాపాలనా చూసుకోని ఓ కూతురు.. ఆస్తి రిజిస్ట్రేషన్ హక్కులను రద్దు చేస్తూ ఓ రెవెన్యూ అధికారి ఇచ్చిన ఉత్తర్వులను న్యాయస్థానం సమర్థించింది. అసలేం జరిగిందంటే..?

తిరుపుర్ జిల్లా ఉడుమలైపేట్‌కు చెందిన రాజమ్మాళ్ తనకు చెందిన 3 ఎకరాల భూమిని కుమార్తె సుగుణకు పేరిట 2016లో రిజిస్ట్రేషన్ చేయించింది. ముందస్తు ఒప్పందం ప్రకారం.. సుగుణ తన ఆలనాపాలనా చూసుకోవడం లేదని ఆస్తి రిజిస్ట్రేషన్​ను రద్దు చేయాలని ఉడుమలైపేట్​ రెవెన్యూ అధికారికి రాజమ్మాళ్​ ఫిర్యాదు చేసింది. రెవెన్యూ అధికారి దర్యాప్తు జరిపి.. సుగుణ ఆస్తి రిజిస్ట్రేషన్​ను రద్దు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ సుగుణ.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

తన ఆలనాపాలనా చూసుకుంటుందని కుమార్తె సుగుణకు రాజమ్మాల్ ఆస్తి రాసిచ్చిందని.. కానీ కుమార్తె ఆమెను పట్టించుకోవడం లేదని విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టులో రెవెన్యూ అధికారి తెలిపారు. విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు అధికారి తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ… ఉత్తర్వుల పట్ల కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news