చేపలు తింటే ఐశ్వర్యరాయ్‌లా అందమైన కళ్లు.. మంత్రి కామెంట్స్

-

నిత్యం ప్రజల్లో ఉండే ప్రజాప్రతినిధులు కాస్త ఆచితూచి మాట్లాడాలి. ఈ మధ్య చాలా మంది నాయకులు నోరుజారి పార్టీకి నష్టం కలిగించడమే కాదు.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురవుతున్నారు. కొందరు నోరుజారి ట్రోల్ అవుతుంటే.. మరికొందరు సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ.. ఇంకొందరు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ నెట్టింట వైరల్ అవుతున్నారు. మహారాష్ట్రకు చెందిన ఓ మంత్రి కూడా తాజాగా నెట్టింట వైరల్ అవుతున్నారు. ఇంతకీ ఆయన చేసిన వ్యాఖ్యలేంటంటే..?

ఆహారంలో చేపలు తీసుకుంటే.. సినీ నటి ఐశ్వర్యరాయ్‌కు ఉన్నట్లు అందమైన కళ్లు సొంతమవుతాయని మహారాష్ట్ర గిరిజనశాఖ మంత్రి విజయ్‌కుమార్‌ గవిత్‌ అన్నారు. నందుర్బార్‌ జిల్లాలో ఓ బహిరంగసభ సందర్భంగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రోజూ చేపలు తినేవారి చర్మం నునుపుగా మారుతుందని.. కళ్లు మెరుస్తాయని.. ఎవరైనా మిమ్మల్ని చూస్తే ఆ వ్యక్తి మీ ఆకర్షణకు లోనవుతారని మంత్రి వ్యాఖ్యానించారు. ఐశ్వర్యరాయ్‌ మంగళూరులోని సముద్ర తీరంలో నివసించేదని.. అందువల్ల రోజూ చేపలు తినేదని.. అందుకే ఆమె కళ్లు అంత అందంగా ఉన్నాయని కామెంట్స్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news