సోషల్ మీడియాలో మామా ఎర్త్‌ సీఈఓ ఎమోషనల్ పోస్టు.. మహిళల రియాక్షన్ ఇదే

-

ఉద్యోగాలు చేస్తున్న దంపతులకు ఎదురయ్యే కష్టం గురించి బ్యూటీ బ్రాండ్ మామాఎర్త్‌ సహ-వ్యవస్థాపకురాలు, సీఈఓ గజల్ అలఘ్‌ ఓ ఎమోషనల్ పోస్ట్‌ చేశారు. నేను మంచి తల్లిని కానా అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఆమె పోస్టు చూసి నెటిజన్లు స్పందించారు. ముఖ్యంగా మహిళలు గజల్ పోస్టుకు రిప్లై ఇస్తూ వీ ఫీల్ యూ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ గజల్ చేసిన పోస్టు ఏంటంటే?

‘‘నా కుమారుడిని తొలి రోజు పాఠశాలకు తీసుకెళ్లడానికి కుదర్లేదు. అప్పుడు నా మదిలో మెదిలిన ప్రశ్న ఇది. నేను మంచి తల్లిని కాదా? ఆ సమయంలో చాలా ఏడ్చా. బాధ పడ్డా. ధైర్యం తెచ్చుకొని వాళ్ల నాన్నమ్మతో స్కూల్‌కి పంపించా. మీరు ఎంత కోరుకున్నా కొన్నిసార్లు సెలవు తీసుకోవడం కుదరదు. అలా మొదటిరోజు స్కూల్‌కు వెళ్లేందుకు కుమారుడు చూపిన ఉత్సాహం, చిరునవ్వు, కన్నీళ్లు, పాఠశాల్లో అడుగు పెట్టగానే ఉపాధ్యాయులు, పిల్లల్ని చూసి కలిగే ఆందోళన.. ఇవన్నీ చూడలేకపోయా’’ అంటూ తనకు ఎదురైన అనుభవాన్ని లింక్డిన్‌ వేదికగా పంచుకున్నారు. ఈ పోస్టుకు మహిళలు స్పందిస్తూ మేం కూడా ఇలాంటి ఫీలింగ్ను చాలా సార్లు అనుభవించామని రిప్లై ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news