దారుణం.. తమ్ముడి ఆత్మహత్యతో మరదలిని సజీవదహనం చేసిన అన్న

-

మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడగా అతడి సోదరుడు తన తమ్ముడి బలవన్మరణానికి మరదలే కారణమని ఆరోపించాడు. అంతటితో ఆగకుండా ఆమెను సజీవదహనం చేశాడు. శనివారం రోజున పట్టపగలే చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశ్‌ అనే వ్యక్తి వ్యక్తిగత కారణాలతో ఆర్నెల్ల కిందట ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి భార్య నిర్మల తన ఇద్దరు పిల్లలతో కలిసి అత్తింటి వద్దే నివసిస్తోంది. అయితే తమ్ముడి బలవన్మరణానికి నిర్మలే కారణమంటూ సురేశ్‌ ఆమెను తరచూ మాటలతో వేధించేవాడు. ఈ క్రమంలో శనివారం రోజున కూడా అలాగే వేధించాడు. అయితే ఆరోజు మాటలు మీరి దాడి వరకూ వెళ్లింది. మొదట సురేశ్ రాడ్డుతో నిర్మలపై దాడి చేసి అనంతరం ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించాడు.

ఈ ఘటన అనంతరం నిర్మల సోదరుడికి ఫోన్ చేసి ‘మీ సోదరికి నిప్పంటించాం’ అని సురేశ్ చెప్పినట్లు నిర్మల్ సోదరుడు తెలిపాడు. ఆమెను పుట్టింటికి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యేలోపు ఈ ఘోరం జరిగినట్లు వాపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version