ఎంపీలతో కలిసి పార్లమెంట్‌ క్యాంటీన్‌లో మోదీ లంచ్‌.. ఫొటోలు వైరల్‌

-

దేశ ఆర్థిక వ్యవస్థపై కేంద్రం ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ శ్వేతపత్రంపై పార్లమెంట్‌లో ఇవాళ చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఇత వాడివేడి చర్చ జరిగిన రోజే పార్లమెంట్‌ ప్రాంగణంలో ఓ అనూహ్య దృశ్యం కన్పించింది. పార్టీలకు అతీతంగా కొంతమంది ఎంపీలతో కలిసి ప్రధాని మోదీ పార్లమెంట్‌ క్యాంటీన్‌లో భోజనం చేశారు.

బీజేపీతో సహా పలు పార్టీలకు చెందిన ఎనిమిది మంది ఎంపీలను ప్రధాని మోదీ ఇవాళ లంచ్‌కు ఆహ్వానించారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఎంపీలకు ప్రధాని ఫోన్ చేసి.. ‘పదండి.. ఈ రోజు మీకో పనిష్మెంట్‌ ఇస్తాను’ అని సరదాగా అన్నట్లు తెలిసింది. అనంతరం బీజేపీ ఎంపీలు హీనాగవిత్‌, ఎల్‌.మురుగన్‌, టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, బీఎస్పీ ఎంపీ రితేశ్‌ పాండేలతో కలిసి ప్రధానితో భోజనం చేశారు. దాదాపు 45 నిమిషాల పాటు కొనసాగిన ఈ లంచ్‌లో ప్రధాని మోదీ పలు విషయాలపై ముచ్చటించినట్లు సమాచారం. విదేశీ పర్యటనల విశేషాలు, వ్యక్తిగత విషయాలను ఆయన పంచుకున్నట్లు తెలుస్తోంది. మోదీ ట్రీట్‌కు సంబంధించి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news