బిజెపి నేత శ్వేతా సింగ్ మృతి కేసులో వీడిన మిస్టరీ !

-

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారిన బీజేపీ నేత మృతి కేసులో స్పష్టత వచ్చింది. ఆమె ఆత్మహత్య చేసుకోలేదని, కట్టుకున్న భర్తే హత్య చేసి ఉరికి వేలాడదీసినట్టు తేలింది. తనకు, అంతర్జాతీయ సెక్స్ ముఠాకు ఉన్న సంబంధాలు భార్యకు తెలిశాయి. ఈ విషయాలను ఆమె బహిర్గతం చేస్తుందని భావించిన భర్త దీపక్ సింగ్ ఆమెను హత్య చేసి చంపేశాడు. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం మేరకు… శ్వేతా సింగ్ భర్త దీపక్ సింగ్ రష్యన్, మొరాకో, ఆఫ్రికన్ అమ్మాయిల కోసం బ్రోకర్ల తో సంప్రదింపులు జరిపారు.

శ్వేత తన మరణానికి ముందు తన భర్త ఫోన్ కాల్స్ రికార్డింగ్ ల గురించి తన కుటుంబ సభ్యులకు తెలిపారు. రష్యాలోని సెక్స్ వర్కర్లతో తనకు వివాహేతర సంబంధాలు ఉన్నాయన్న విషయాన్ని దాచి పెట్టినందుకు దీపక్ ఆమెను హత్య చేసి ఉంటాడని ఆమె సోదరుడు రితురాజ్ ఆరోపించారు.ఆ ఆడియోలో దీపక్ ఓ రష్యన్ అమ్మాయిని అడగ్గా బ్రోకర్ మాత్రం తన వద్ద మొరాకో అమ్మాయి మాత్రమే ఉందని చెప్పాడు.ఇప్పుడు దీపక్.. తాము నలుగురం ఉన్నామని, కాబట్టి ఒక ఇండియన్ అమ్మాయి కూడా కావాలని కోరాడు.

ఈ సంభాషణ చాలా సేపు నడిచింది. అనంతరం దీపక్.. తాను లక్నోలోని నాకా హిందోళ ప్రాంతంలో ఉన్న ఎంజే ఇంటర్నేషనల్ హోటల్ లో ఉన్నట్టు చెప్పాడు.అక్కడికే ఇద్దరు అమ్మాయిలను పంపాలని కోరారు.కాగా దీపక్ సింగ్ ను గత శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ కేసుకు సంబంధించి పలు వీడియోలు కూడా అందుకున్నట్టు ఎస్పీ అభినందన్ చెప్పారు. అన్నింటిపైనా దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news